న్యూఢిల్లీ: యూరోప్లో జరిగే ఎఫ్ఐహెచ్ హాకీ ప్రొ లీగ్లో పాల్గొనే 24మంది సభ్యుల భారత జట్టును ప్రకటించారు. ఏస్ డ్రాగ్ ఫ్లికర్ హర్మన్ప్రీత్ సింగ్ జట్టుకు సారధ్యం వహిస్తాడు.
ఇండియాలో జరిగిన లీగ్లో అన్ని మ్యాచ్లలో గెలిచి అగ్రస్థానంలో నిలిచిన భారత జట్టు యూరోప్ లీగ్లోనూ ఆ స్థానాన్ని నిలబెట్టుకోవాలని ఆశిస్తున్నది.