చెన్నై: చెస్ ఒలింపియాడ్లో భారత జట్టు సత్తాచాటుతుందని.. తెలంగాణ యువ గ్రాండ్మాస్టర్ అర్జున్ ఇరిగైసి ఆశాభావం వ్యక్తంచేశాడు. వచ్చే నెలలో మహాబలిపురం వేదికగా జరుగనున్న మెగాటోర్నీలో భారత్-‘ఎ’, ‘బి’ జట్లు రాణిస్తాయనే నమ్మకం తనకుందని అర్జున్ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఫిడే క్లాసికల్ రేటింగ్స్లో 2681 పాయింట్లతో కొనసాగుతున్న అర్జున్.. 2700 మార్క్ను చేరుకోవడమే తన ముందున్న లక్ష్యమని చెప్పాడు. ఈ ఏడాది వరుస విజయాలతో జోరుమీదున్న అర్జున్ సోమవారం మాట్లాడుతూ.. ‘భారత జట్లు బలంగా ఉన్నాయి. అమెరికా ఫేవరెట్గా బరిలోకి దిగుతున్నా.. వారిని ఓడించే సత్తా మన ‘ఎ’, ‘బి’ టీమ్లకు ఉంది. టోర్నీలో మెరుగైన ప్రదర్శన చేస్తామనే నమ్మకముంది. ఇటీవలి కాలంలో ఎక్కువ టోర్నీలు ఆడటం నాకు కలిసొచ్చింది’ అని అన్నాడు.