పారిస్: భారత స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ సెమీఫైనల్కు దూసుకెళ్లారు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ సిరీస్ సూపర్-750 పురుషుల డబుల్స్ క్వార్టర్స్లో సాత్విక్-చిరాగ్ జంట 23-21, 21-18తో టకురో హోకీ-యుగో కొబాయషి (జపాన్) ద్వయంపై గెలిచింది.
ఏడో సీడ్గా బరిలోకి దిగిన భారత జంట.. వరుస గేమ్ల్లో ప్రత్యర్థిని చిత్తు చేసింది. సెమీస్లో చోయి సోల్ల-కిమ్ వోన్ (కొరియా)తో మన షట్లర్లు తలపడనున్నారు. పురుషుల సింగిల్స్లో కిడాంబి శ్రీకాంత్ తో పాటు సమీర్ వర్మ, హెచ్ఎస్ ప్రణయ్ ఓటమి పాలవగా.. ఈ టోర్నీలో భారత్ నుంచి సాత్విక్-చిరాగ్ జోడీ మాత్రమే పోటీలో ఉంది.