PV Sindhu | టోక్యో: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు పేలవ ప్రదర్శన కొనసాగుతున్నది. జపాన్ ఓపెన్ సూపర్-750 టోర్నీలో సింధు తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ పోరులో సింధు 12-21, 13-21తేడాతో జాంగ్ యి మన్(చైనా) చేతిలో ఓటమిపాలైంది. ఈ ఏడాది 13 బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్లలో సింధుకు ఇది ఏడో తొలి రౌండ్ నిష్క్రమణ.
మరోవైపు సాత్విక్సాయిరాజ్, చిరాగ్శెట్టి జోడీ 21-16, 11-21, 21-13తో ఇండోనేషియా ద్వయం లియో రోలీ, డానియల్ మార్టిన్పై అద్భుత విజయం సాధించింది. పురుషుల సింగిల్స్లో లక్ష్యసేన్ 21-15, 12-21, 24-22తో ప్రియాంశు రజావత్పై గెలిచి ముందంజ వేశాడు.