మాడ్రిడ్: ఈ ఏడాది తొలిసారి ఓ టోర్నీ ఫైనల్కు చేరిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు.. రన్నరప్తో సరిపెట్టుకుంది. స్పెయిన్ మాస్టర్స్ టోర్నీ మహిళల సింగిల్స్ ఫైనల్లో రెండో సీడ్గా బరిలోకి దిగిన సింధు 8-21, 8-21తో గ్రెగోరియా మారిస్కా (ఇండోనేషియా) చేతిలో ఓటమి పాలైంది.
టోర్నీ ఆసాంతం రాణించిన తెలుగమ్మాయి.. తుదిపోరులో మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ప్రత్యర్థికి కనీస పోటీనివ్వలేక వరుస గేమ్ల్లో పరాజయం పాలైంది. గాయం నుంచి కోలుకున్న తర్వాత స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న సింధు.. ఇటీవల టాప్-10 ర్యాంకింగ్స్లో చోటు కోల్పోయిన విషయం తెలిసిందే. నిరుడు ఆగస్టులో జరిగిన బర్మింగ్హామ్ కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణం నెగ్గిన అనంతరం సింధుకు ఇదే తొలి ఫైనల్ కావడం గమనార్హం.