బ్యాంకాక్: భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్కు థాయ్లాండ్ మాస్టర్స్లో చుక్కెదురైంది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-300 టోర్నీ ప్రిక్వార్టర్స్లో శ్రీకాంత్ 9-21, 21-13, 17-21తో భారత్కే చెందిన మిథున్ మంజునాథన్ చేతిలో పరాజయం పాలయ్యాడు. మూడు గేమ్ల పాటు సాగిన పోరులో ప్రపంచ మాజీ నంబర్వన్పై 63వ ర్యాంకర్ పైచేయి సాధించాడు. మహిళల సింగిల్స్లో అశ్మిత క్వార్టర్స్లో అడుగుపెట్టగా.. డబుల్స్లో గ్రాయత్రి గోపీచంద్-త్రిసా జాలీ జంట 21-15, 24-22తో భారత్కే చెందిన అశ్విని పొన్నప్ప-తనీషా ద్వయంపై విజయం సాధించింది.