న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ గెలుపు జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. ప్రత్యర్థి ఎవరైనా గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న నిఖత్ ప్రిక్వార్టర్స్లోకి దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన 50కిలోల బౌట్లో నిఖత్ 5-0 తేడాతో బౌలమ్ రౌమస్య(అల్జీరియా)పై అద్భుత విజయం సాధించింది.
ఆది నుంచే తనదైన జోరు కనబరిచిన ఈ ఇందూరు బాక్సర్ పదునైన పంచ్లతో విరుచుకుపడింది. ప్రత్యర్థి బాక్సర్ తన కంటే టాప్సీడ్లో ఉన్నా.. ఎక్కడా వెనుకకు తగ్గకుండా రౌండ్ రౌండ్కు తన ఆధిక్యాన్ని పెంచుకుంటూ పోయింది. మరోవైపు 57కిలోల బౌట్లో మనీశా మౌన్ 5-0 తేడాతో రహిమీ టీనా (ఆస్ట్రేలియా)పై అలవోక విజయం సాధించి ప్రిక్వార్టర్స్లోకి ప్రవేశించింది. సోమవారం జరిగే బౌట్లలో లవ్లీనా బొర్గోహై, సాక్షి చౌదరీ, ప్రీతి బరిలోకి దిగనున్నారు.