న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో స్వర్ణం పతకం గెలిచిన భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా మరో ఘనత సొంతం చేసుకోనున్నాడు. జావెలిన్ త్రోలో ప్రకంపనలు సృష్టిస్తున్న నీరజ్ వరల్డ్ అథ్లెట్ 2023 నామినేషన్ దక్కించుకున్నాడు. పురుషుల విభాగంలో ఈ అవార్డుకు నామినేట్ అయిన 10 మందిలో నీరజ్ ఒకడు.
పరుగుల వీరుడు నొవాహ్ లిల్స్, షాట్పుటర్ రియాన్ క్రౌసర్, పోల్వాల్ట్ స్టార్ మొండో డుప్లంటిస్, 3వేల మీటర్ల స్టీపుల్ ఛేజ్ రన్నర్ సౌఫియానే బక్కాలి, 5వేల మీటర్ల స్ప్రింటర్ జాకబ్ ఇంగెబ్రిగ్స్టెన్, మారథాన్ రన్నర్ పియెర్సె లెపగే, రేస్ వాకర్ అల్వారో మార్టిన్, లాంగ్ జంపర్ మిల్తియడిస్ టెంటొగ్లూ పోటీ పడుతున్నారు. ఈ ఏడాది నీరజ్ చోప్రా సంచలన ప్రదర్శనతో వరల్డ్ చాంపియన్గా అవతరించాడు. హాంగ్జౌలో జరిగిన ఆసియా క్రీడల్లో అదే జోరు కనబరిచి.. ఫైనల్లో ఈటెను 88.88 మీటర్ల దూరం విసిరి దేశానికి పసిడి పతకం అందించాడు. వచ్చే ఏడాది ప్యారిస్ ఒలింపిక్స్లో నీర జ్ భారీ అంచనాలతో బరిలోకి దిగనున్నాడు.