జకార్తా : భారత షట్లర్లు శ్రీకాంత్, ప్రణయ్ ఇండోనేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్కు చేరుకున్నారు. పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి-చిరాగ్ శెట్టి జోడి ముందంజవేయగా, ఓటమితో సింధు టోర్నీనుంచి నిష్క్రమించింది.
గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్లో శ్రీకాంత్ స్వదేశానికే చెందిన లక్ష్య సేన్ను 21-17, 22-20 స్కోరుతో 45 నిమిషాల్లో ఓడించగా, ప్రణయ్ 21-18-21-16తో హాంకాంగ్కు చెందిన అంగస్ ఎంగ్ లాంగ్పై 43 నిమిషాల్లో విజయాన్నందుకున్నాడు. సింధు వరుస విజయాలకు తెరపడింది. తైజు ఇంగ్ (చైనీస్ తైపీ)చేతిలో 21-18, 21-16తో సింధు ఓడిపోయింది.శ్రీకాంత్ క్వార్టర్ఫైనల్లో లి షి ఫెంగ్తో, ప్రణయ్ కొదయ్ నరఒకతో తలపడతారు. సాత్విక్-చిరాగ్ 21-17, 21-15తో చైనాకు చెందిన హి జి టింగ్-జౌ హో డాంగ్ జోడిపై గెలుపొందారు.