కౌలాలంపూర్ : భారత షట్లర్లు పివి సింధు, హెచ్ఎస్ ప్రణయ్ మలేషియా మాస్టర్స్ సూపర్500 బ్యాడ్మింటన్ టోర్నీలో చెమటోడ్చి సెమీఫైనల్కు చేరుకున్నారు. ఆరో సీడ్ సింధు చైనాకు చెందిన యి మన్ ఝాంగ్ను 21-16, 13-21, 22-20తో ఓడించింది. సింధు సెమీస్లో ఏడో సీడ్ జార్జియా మరిష్క టన్జంగ్ను ఎదుర్కొంటుంది.
టన్జంగ్ క్వార్టర్స్లో రెండో సీడ్ యి జి వాంగ్(చైనా)పై 21-18, 22-20తో అనూహ్య విజయం సాధించింది.కాగా ప్రణయ్ 25-23, 18-21, 21-13తో జపాన్కు చెందిన కెంటా నిషిమొటొపై విజయం గెలుపొందాడు. సెమీస్లో ప్రణయ్ ఇండోనేషియాకు చెందిన క్రిస్టియన్ను ఢీకొంటాడు. క్వార్టర్స్లో క్రిస్టియన్ భారత్కు చెందిన కిడాంబి శ్రీకాంత్ను 16-21, 21-16, 21-11తో ఓడించాడు.