బర్మింగ్హామ్: ఆల్ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత షట్లర్లు పుల్లెల గాయత్రి గోపీచంద్-త్రిసా జాలీ జంట ఓటమి పాలైంది. అద్వితీయ ప్రదర్శనతో సెమీఫైనల్ వరకు వచ్చిన భారత జోడీ.. టైటిల్కు రెండడుగుల దూరంలో నిలిచిపోయింది. శనివారం జరిగిన మహిళల డబుల్స్ సెమీస్లో గాయత్రి-త్రిసా జోడీ 10-21, 10-21తో బీక్ నహా-లీ సో హీ ద్వయం చేతిలో ఓటమి పాలైంది.
వరుస విజయాలతో సెమీస్ చేరిన భారత జంట.. 46 నిమిషాల పాటు సాగిన పోరులో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ‘ఈ మ్యాచ్ నుంచి చాలా నేర్చుకున్నాం. కాస్త ఒత్తిడికి లోనవడంతో ఓటమి ఎదురైంది’ అని మ్యాచ్ అనంతరం గాయత్రి పేర్కొంది. జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ 2001లో చివరిసారిగా భారత్ నుంచి ఆల్ఇంగ్లండ్ చాంపియన్షిప్ నెగ్గగా.. ఆ తర్వాత మన షట్లర్లు ఎవరూ విజేతగా నిలువలేకపోయారు.