న్యూఢిల్లీ: మాల్దీవ్స్ ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్లు అస్మిత చలిహ, రవి విజేతలుగా నిలిచారు. మహిళల సింగిల్స్ ఫైనల్లో మూడో సీడ్ అస్మిత 19-21, 21-17, 21-11 స్కోరుతో భారత్కే చెందిన తస్నీమ్ మిర్పై గెలుపొందింది. అస్మితకిది మూడో బిడబ్ల్యుఎఫ్ ఇంటర్నేషనల్ చాలెంజ్ టైటిల్. గతంలో ఆమె టాటా ఓపెన్ ఇండియా ఇంటర్నేషనల్, దుబాయ్ ఇంటర్నేషనల్ టోర్నీల్లో విజేతగా నిలిచింది.
పురుషుల సింగిల్స్ ఫైనల్లో రవి 21-19, 21-18తో మలేషియాకు చెందిన ఏడో సీడ్ సూంగ్ జో వెన్ను ఓడించి టైటిల్ అందుకున్నాడు. మహిళల డబుల్స్ ఫైనల్లో భారత జోడి అశ్విని భట్-శిఖ గౌతమ్ 22-23, 15-21తో థాయిలాండ్కు చెందిన లక్సిక కన్లహ-ఫతైమాస్ మూన్వాంగ్ ద్వయం చేతిలో ఓడి రన్నరప్తో సరిపెట్టుకుంది.