న్యూఢిల్లీ: ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్లో భారత షూటర్లు సత్తాచాటారు. కొరియా వేదికగా గురువారం ముగిసిన మెగాటోర్నీ పతకాల పట్టికలో మనవాళ్లు టాప్లో నిలిచారు. పోటీల చివరి రోజు పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో అర్జున్, తుషార్, పార్థ్తో కూడిన భారత బృందం స్వర్ణం చేజిక్కించుకుంది.
మహిళల విభాగంలో ఎలవనిల్ వలరివన్, మెహులీ ఘోష్, రమితతో కూడిన భారత జట్టు రజతం కైవసం చేసుకోగా.. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్, మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగాల్లో మనవాళ్లకు రజతాలు దక్కాయి. దీంతో ఓవరాల్గా ఈ టోర్నీలో భారత్ 8 పతకాలు (3 స్వర్ణాలు, 4 రజతాలు, ఒక కాంస్యం) సొంతం చేసుకొని అగ్రస్థానంలో నిలిచింది.