న్యూఢిల్లీ : ఏషియన్ షూటింగ్ చాంపియన్షిప్లో భారత షూటర్ల పతక జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. గురువారం జరిగిన పురుషుల 50మీటర్ల రైఫిల్-3 పొజిషన్లో యువ షూటర్ ఐశ్వర్య్ ప్రతాప్సింగ్ తోమర్ ప్రపంచ రికార్డుతో పసిడి పతకం కైవసం చేసుకున్నాడు. ఈ విభాగంలో భారత షూటర్లు క్లీన్స్వీప్ చేశారు.
ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన ఫైనల్లో ఐశ్వర్య్ ప్రతాప్ 362 వరల్డ్ రికార్డు స్కోరుతో అగ్రస్థానంలో నిలువగా, నీరజ్కుమార్(361.8), అఖిల్ షెరాన్(343.5) వరుసగా రజత, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. కేవలం 0.2 పాయింట్ తేడాతో ఐశ్వర్య్ పసిడి పతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు. తన ఆఖరి షాట్లో 10.7 పాయింట్లు సాధించడంతో ప్రపంచ రికార్డు ఐశ్వర్య సొంతమైంది. మరోవైపు ఐశ్వరీ, నీరజ్, అఖిల్తో కూడిన భారత త్రయం 1769 పాయింట్లతో టీమ్ ఈవెంట్లోనూ స్వర్ణం సాధించింది.