గ్రేటర్ నోయిడా: ఆసియా యూత్, జూనియర్ వెయిట్లిఫ్టింగ్ చాంపియన్షిప్లో భారత ప్లేయర్లు అదరగొడుతున్నారు. శనివారం జరిగిన పురుషుల 55కిలోల విభాగంలో సేనాపతి గురునాయుడు రజత పతకంతో మెరువగా, తోమ్చౌ మీతి కాంస్యం ఖాతాలో వేసుకున్నాడు.
పురుషుల జూనియర్ 55 కిలోల కేటగిరిఈలో ముకుంద్ సంతోష్ రజతం దక్కించుకున్నాడు. వచ్చే నెల 5వ తేదీ వరకు జరుగనున్న టోర్నీలో 18 ఆసియా దేశాల నుంచి 220 మందికి పైగా లిఫ్టర్లు పోటీపడుతున్నారు.