లక్నో : సయ్యద్ మోది అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల డబుల్స్లో భారత్ జోడి త్రిష క్రాస్టొ-అశ్విని పొన్నప్ప ఫైనల్స్కు చేరుకున్నారు. శనివారం జరిగిన సెమీఫైనల్లో తొలి గేమ్లో 10-11తో భారత జోడి వెనుకంజలో ఉన్న సమయం లో ప్రత్యర్థి జపాన్ జోడి యుకి ఫకుషిమ-సయాక హిరొట గాయంతో పోటీనుంచి విరమించుకున్నారు.
దీనితో క్రాస్టొ-అశ్వినిలను విజయం వరించింది. కాగా పురుషుల సింగిల్స్లో ప్రియాంశు రజవత్ 21-18, 14-21, 17-21 చి యు జెన్ చేతిలో ఓడిపోయాడు.