ఢిల్లీ: కజకిస్థాన్లోని అల్మటి వేదికగా జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ షాట్గన్ వరల్డ్కప్లో భాగంగా ట్రాప్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత షూటర్లు నీరూ దండ, వివాన్ కపూర్ జోడీ కాంస్యం గెలుచుకుంది.
30 టార్గెట్లకు గాను 24 పాయింట్లు గురిపెట్టిన భారత జంట మూడో స్థానంతో కాంస్యం నెగ్గగా చైనీస్ తైపీ, ఇటలీ వరుసగా పసిడి, రజతం గెలిచాయి.