న్యూఢిల్లీ: భారత హాకీ ప్లేయర్ వందనా కటారియా అరుదైన ఘనత సొంతం చేసుకుంది. సుదీర్ఘ దేశ హాకీ చరిత్రలో తనకంటూ ఒక అధ్యాయాన్ని లిఖించుకుంది. నిరుపేద దళిత కుటుంబంలో జన్మించిన వందన..అంచెలంచెలుగా ఎదుగుతూ భారత్ తరఫున 300 అంతర్జాతీయ మ్యాచ్ల్లో ప్రాతినిధ్యం వహించే స్థాయికి ఎదిగింది.
ఈ అరుదైన రికార్డు అందుకున్న తొలి భారత హాకీ ప్లేయర్గా వందన నిలిచింది. ఏషియన్ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా మంగళవారం జపాన్తో మ్యాచ్ ద్వారా వందన ఈ మార్క్ అందుకుంది. 2011లో జాతీయ జట్టులోకి అరంగేట్రం చేసిన వందన.. అనతి కాలంలోనే కీలక ప్లేయర్గా ఎదిగింది.