గబాల(అజర్బైజాన్) : భారత గ్రాండ్మాస్టర్ విదిత్ గుజరాతి సోమవారం వగర్ గషిమోవ్ స్మారక చెస్ టోర్నెమెంట్ను గెలుచుకున్నాడు. రాపిడ్ విభాగంలో రెండు విజయాలు, ఒక పరాజయం, ఏడు డ్రాలతో రెండో స్థానంలో నిలిచిన విదిత్, బ్లిట్జ్ విభాగంలో 7/9 పాయింట్లు సాధించి మొదటి స్థానంలో నిలిచి ఓవరాల్గా 22 పాయింట్లతో టైటిల్ను దక్కించుకున్నాడు.
భారత్కే చెందిన అర్జున్ ఇరిగేసి(21.5) అరపాయింట్ తేడాతో రెండో స్థానంలో, హంగరీ జిఎం రిచర్డ్ రాపోర్ట్ 19 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచారు.