Vidit Gujrathi : చదరంగం ఆటలో వరల్డ్ నంబర్ 1 అయిన మాగ్నస్ కార్ల్సన్కు భారత గ్రాండ్మాస్టర్ విదిత్ గుజరాతీ షాక్ ఇచ్చాడు. ప్రో చెస్ లీగ్ ఆన్లైన్ మ్యాచ్లో అతను కార్ల్సన్ను ఓడించాడు. ప్రపంచ నంబర్ 1 ఆటగాడిపై విదిత్కు ఇదే తొలి విజయం. ఈ టోర్నమెంట్లో విదిత్ ఇండియన్ యోగిస్ టీమ్కు, కార్ల్సన్ కెనడా చెస్బ్రాహ్స్ టీమ్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
నల్ల పావులతో ఆడిన విదిత్ తన ఎత్తులతో కార్ల్సన్పై పై చేయి సాధించాడు. ‘చెస్ ఆటలో ఛాంపియన్ అయిన కార్ల్సన్ను ఓడించడం గొప్ప అనుభూతి. ఇంతకంటే గొప్ప క్షణం కావాలని నేను కోరుకోను’ అని మ్యాచ్ అనంతరం విదిత్ తన సంతోషాన్ని పంచుకున్నాడు.
మొత్తంగా అయితే.. కార్ల్సన్ను ఓడించిన నాలుగో ఇండియన్గా అతను రికార్డు సాధించాడు. భారత గ్రాండ్మాస్టర్లు ఆర్. ప్రజ్జానందా, డి.గుకేష్, అర్జున్ ఎరిగైసి ఇప్పటివరకు కార్ల్సన్పై గెలుపొందారు. గత ఏడాది జరిగిన పలు పోటీల్లో ఈ ముగ్గురు ఈ నార్వే ఆటగాడికి షాకిచ్చారు. ఈ ఆన్లైన్లో టోర్నమెంట్లో ప్రపంచవ్యాప్తంగా పలువురు చెస్ ఆటగాళ్లు పాల్గొంటున్నారు. మొత్తం 16 టీమ్లు ర్యాపిడ్ గేమ్స్ ఆడుతున్నాయి. విజేతలకు రూ. 1.24 కోట్ల ప్రైజ్ మనీ లభించనుంది.