Himanshu Singh : ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ పట్టికలో అగ్రస్థానంలో ఉన్న భారత జట్టు(Team India) స్వదేశంలో తొలి టెస్టు సిరీస్లో విజయమే లక్ష్యంగా పెట్టుకుంది. బంగ్లాదేశ్(Bangladesh)తో జరిగే రెండు టెస్టుల సిరీస్ కోసం టీమిండియా గట్టిగానే ప్రాక్టీస్ చేయనుంది. అందుకోసం భారత క్రికెటర్లు నెట్స్లో కొత్త కుర్రాడి బౌలింగ్ను ఎదుర్కోనున్నారు. అతడి పేరు.. హిమాన్షు సింగ్(Himanshu Singh).
ఆరడుగుల నాలుగు ఇంచుల పొడవు ఉండే అతడు అచ్చం సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ను తలపిస్తాడు. హిమాన్ష్ బౌలింగ్ యాక్షన్ అశ్విన్ మాదిరిగానే ఉంటుంది. అందుకని అతడి బౌలింగ్లో టీమిండియా ఆటగాళ్లు నెట్స్లో ప్రాక్టీస్ చేయనున్నారు. హిమాన్ష్ విషయానకొస్తే.. అతడు అండర్ -16, అండర్-23 విభాగాల్లో ముంబై జట్టు తరఫున ఆడాడు. ఈమధ్యే తిమ్మప్పయ్య మెమోరియల్ టోర్నమెంట్లో హిమాన్ష్ విజృంభించాడు. ఆంధ్రా జట్టుపై 74 పరుగులకే 7 వికెట్లు పడగొట్టి ముంబై విజయలో కీలక పాత్ర పోషించాడు.
🚨 NEWS 🚨- Team India’s squad for the 1st Test of the IDFC FIRST Bank Test series against Bangladesh announced.
Rohit Sharma (C), Yashasvi Jaiswal, Shubman Gill, Virat Kohli, KL Rahul, Sarfaraz Khan, Rishabh Pant (WK), Dhruv Jurel (WK), R Ashwin, R Jadeja, Axar Patel, Kuldeep… pic.twitter.com/pQn7Ll7k3X
— BCCI (@BCCI) September 8, 2024
భారత్, బంగ్లాదేశ్ల మధ్య సెప్టెంబర్ 19న చెన్నైలో తొలి టెస్టు.. అనంతరం సెప్టెంబర్ 27న కాన్పూర్లో రెండో టెస్టు జరుగనుంది. తొలి టెస్టు కోసం బీసీసీఐ 16 మందితో కూడిన స్క్వాడ్ను ప్రకటించింది. దాదాపు ఏడాదిన్నర తర్వాత రిషభ్ పంత్ మళ్లీ టెస్టుల్లో ఆడనున్నాడు. దులీప్ ట్రోఫీ(Duleep Trophy)లో బంతితో హడలెత్తించిన యశ్ దయాల్, ఆకాశ్ దీప్లు కూడా టెస్టు స్క్వాడ్లో చోటు దక్కించుకున్నారు.
భారత స్క్వాడ్ : రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్(వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, సిరాజ్, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, యశ్ దయాల్.