మునుగోడు, మార్చి 08 : మహిళలతోనే సమాజ అభివృద్ధి అని మునుగోడు సర్పంచ్ పాలకూరి రమాదేవి అన్నారు. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీ మహిళా కార్మికులను, అంగన్వాడీ, ఆశా వర్కర్లు, మహిళా వైద్యురాలు సరళ, పలువురు గ్రామ మహిళలను సర్పంచ్ శాలువాతో సన్మానించారు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని కోరారు. మహిళలే సమాజ అభివృద్ధిలో కీలకం అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.