చెన్నై : అమిచెస్ ర్యాపిడ్ ఆన్లైన్ చెస్ టోర్నీలో భారత ఆటగాళ్ల పోరు క్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. క్వార్టర్స్కు చేరిన ముగ్గురు భారత ఆటగాళ్లు అర్జున్ ఇరిగేసి, గుకేష్, విదిత్ సంతోష్ గుజరాతి క్వార్టర్స్లో ఓడిపోయారు.
ప్రిలిమినరీ రౌండ్లో ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ను ఓడించిన గుకేష్ 1.5-2.5 తేడాతో రిచర్డ్ రాపోర్ట్ చేతిలో ఓడిపోయాడు. ఇక అర్జున్ 0.5-2.5 తేడాతో ప్రపంచ చాంపియన్ కార్ల్సన్ చేతిలో, విదిత్ సంతోష్ 0.5-2.5తో జాన్ క్రిస్టాఫ్ చేతిలో ఓడిపోయారు.