హాంగ్జూ: భారత మహిళా బాక్సర్ పర్వీన్ హూడా(Parveen Hooda)కు బాక్సింగ్లో కాంస్య పతకం దక్కింది. 57 కేజీల విభాగంలో ఆమె ఇవాళ జరిగిన సెమీస్ మ్యాచ్లో ఓడిపోయింది. రెండుసార్లు ఆ క్యాటగిరీలో ప్రపంచ చాంపియన్గా నిలిచిన చైనీస్ తైపీ బాక్సర్ లిన్ యూ టింగ్ చేతిలో పర్వీన్ పరాజయం పాలైంది. 2022 వరల్డ్ చాంపియన్షిప్లో బ్రాంజ్ మెడల్ గెలిచిన పర్వీన్.. ఇవాళ జరిగిన బౌట్లో 5-0 తేడాతో దారుణంగా ఓడింది. ఎత్తు కుదరకపోవడంతో.. పర్వీన్ సరైన పంచ్లను విసరలేకపోయింది.
PARVEEN SETTLES FOR BRONZE🥉🥊
In the Women’s 57 kg boxing category at #AsianGames2022, @BoxerHooda has secured a BRONZE🥉, adding another medal to India’s rich medal haul🌟
Very well played, Parveen👍🏻#Cheer4India#JeetegaBharat#BharatAtAG22#Hallabol pic.twitter.com/NMtvVN5hqR
— SAI Media (@Media_SAI) October 4, 2023
అయిదు దశల్లోనూ వెనుకంజ వేసిన పర్వీన్.. 27 ఏళ్ల లిన్ దూకుడు ముందు తలవంచకతప్పలేదు. అయితే వచ్చే ఏడాది పారిస్లో జరగనున్న ఒలింపిక్ క్రీడల కోసం ఇప్పటికే పర్వీన్ తన బెర్త్ను ఖరారు చేసుకున్నది. ఈ ఏడాది ఆసియా క్రీడల్లో బ్రాంజ్ మెడల్ గెలిచిన నాలుగవ బాక్సర్గా పర్వీన్ నిలిచింది. వరల్డ్ చాంపియన్ నిఖత్ జరీన్(50కేజీ), ప్రీతి పవార్(54కేజీ), నరేందర్ బెర్వాల్(92కేజీ) కూడా కాంస్య పతకాలు గెలిచారు.