Olympics |ముంబై: చైనాలోని హాంగ్జౌ వేదికగా జరిగిన 19వ ఆసియాడ్లో భారత క్రీడాకారులు 107 పతకాలతో చరిత్రను తిరగరాశారు. దాంతో, వచ్చే ఏడాది ప్యారిస్ ఒలింపిక్స్లోనూ మన అథ్లెట్లు, షూటర్లు, ఆర్చర్లు ఇదే పతక జోరు కొనసాగించాలని దేశమంతా కోరుకుంటోంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం (ఐఓసీ), ముఖేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ కంపెనీ సంయుక్తంగా భారత్లో ఒలింపిక్ క్రీడల గొప్పతనాన్ని ప్రచారం చేయాలనే ఒప్పందంపై సంతకాలు చేశాయి.
అయితే.. మొదటగా ముంబై లో ఎంపిక చేసి స్కూల్ పిల్లలకు అథ్లెట్లతో సెషన్ల వారీగా ఒలిపింక్ పోటీల ఔన్నత్యాన్ని వివరించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా మహారాష్ట్రలో 1.75 కోట్ల మంది పిల్లల్లో స్ఫూర్తి నింపుతామని, ఒడిశాలో ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ అభినవ్ బింద్రా ఫౌండేషన్తో అద్భుత ఫలితాలు సాధించామని ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్ పేర్కొన్నాడు.