న్యూఢిల్లీ: వరుస పతకాలతో మంచి జోరు మీదున్న భారత అథ్లెట్ మురళీ శ్రీశంకర్ మరో స్వర్ణం ఖాతాలో వేసుకున్నాడు. ఇటీవలే జాతీయ రికార్డు (8.36 మీటర్లు) తన పేరిట రాసుకున్న శ్రీశంకర్.. గ్రీస్లో జరిగిన అథ్లెటిక్స్ మీట్ లాంగ్జంప్లో 7.95 మీటర్ల దూరం లంఘించి పసిడి పతకం కైవసం చేసుకున్నాడు.
జూల్స్ పామ్రే (7.73 మీ.), ఎర్విన్ కొనాటే (7.71 మీ.) వరుసగా రజత, కాంస్యాలు దక్కించుకున్నారు. కేరళకు చెందిన 23 ఏండ్ల శ్రీశంకర్ ఇప్పటికే ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్నకు అర్హత సాధించిన విషయం తెలిసిందే. డిసెంబర్లో ఆసీస్ టీమ్ భారత్ టూర్..