అహ్మదాబాద్: అహ్మదాబాద్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ అభిమానులకు కొత్త అనుభూతిని అందించబోతున్నది. ఈ నెల 19వ తేదీన జరుగనున్న ప్రపంచకప్ ఫైనల్లో భారత ఎయిర్ఫోర్స్కు చెందిన సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్ ప్రదర్శనలు ఇవ్వబోతున్నది. ఈ విషయాన్ని గుజరాత్కు చెందిన డిఫెన్స్ పీఆర్వో గురువారం ఒక ప్రకటనలో ధృవీకరించారు. ఫైనల్ పోరు మొదలయ్యే పది నిమిషాల ముందు మొతెరా స్టేడియంపై సూర్యకిరణ్ ఎయిర్క్రాఫ్ట్లు ఆకాశంలో అద్భుత విన్యాసాలతో అలరించనున్నాయి. మొత్తం తొమ్మిది ఎయిర్క్రాఫ్ట్లు రకరకాల ఆకారాలతో అబ్బురపరుచనున్నాయి. శుక్ర, శనివారాల్లో ఎయిర్షో రిహార్సల్స్ ఉంటాయని రక్షణ వర్గాలు పేర్కొన్నాయి.