IND vs SL : తిరువనంతపురంలో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ మరోసారి శుభారంభం ఇచ్చారు. వీళ్లిద్దరూ హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నిర్మించారు. లహిరు కుమార వేసిన ఆరో ఓవర్లో శుభ్మన్ గిల్ విరుచుకుపడ్డాడు. తొలి బంతి సిక్సర్, ఆ తర్వాతి మూడు బంతులను ఫోర్లుగా మలిచాడు. దాంతో, ఆ ఓవర్లో ఏకంగా 23 రన్స్ వచ్చాయి. రజిత వేసిన 10వ ఓవర్లో రోహిత్ వరుసగా రెండు భారీ సిక్సర్లు బాదాడు. గిల్ 35, రోహిత్ 36 ఆడుతు్నారు. 10 ఓవర్లు భారత్ వికెట్ నష్టపోకుండా 75 పరుగులు చేసింది.
రెండు వన్డేల్లో గెలిచిని భారత్ ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకుంది. నామమాత్రమైన ఈ వన్డేలో కూడా విజయం సాధించి 3-0తో సిరీస్ గెలవాలనే పట్టుదలతో ఉంది. తుది జట్టులోకి సూర్యకుమార్ యాదవ్, వాషింగ్టన్ సుందర్కు చోటు లభించింది.