ICC Cricket World Cup 2023 | ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్లో రెండు అత్యుత్తమ జట్ల మధ్య సమరానికి సమయం ఆసన్నమైంది. ఓటమన్నది లేకుండా ప్రత్యర్థులను చిత్తుచేస్తూ దూసుకెళుతున్న భారత్, న్యూజిలాండ్ జట్లు అమీతుమీకి సిద్ధమయ్యాయి. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల వేదికగా ఢీ అంటే ఢీ అనబోతున్నాయి. సొంతగడ్డపై మెగాటోర్నీ ఆడుతున్న రోహిత్సేన.. కివీస్ రెక్కలు విరిచి నాలుగేండ్ల క్రితం తమకు ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్నది. ఈ క్రమంలో టాస్ గెలిచిన టీమ్ఇండియా బౌలింగ్ ఎంచుకుని న్యూజిలాండ్కు బ్యాటింగ్ అప్పగించింది.
ఇక ఈ మ్యాచులో గెలిచిన జట్టు సెమీస్ బెర్తుకు మరింత చేరువయ్యే అవకాశముంది. తమ తొలి మ్యాచ్లో ఆసీస్ను చిత్తుచేసి ఆపై అఫ్గానిస్థాన్, చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్, బంగ్లాదేశ్ను మట్టికరిపించిన రోహిత్సేన.. కివీస్ భరతం పట్టేందుకు పక్కా ప్రణాళికతో సిద్ధమైంది. అయితే ఈ మ్యాచ్కు ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య దూరం కాగా సూర్య కుమార్ యాదవ్ జట్టులోకి వచ్చాడు.
తుది జట్లు :
భారత్ : రోహిత్ శర్మ (సి), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వి), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్
న్యూజిలాండ్ : డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (w/c), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, మిచెల్ సాంట్నర్, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్