కైరో: ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ చాంపియన్షిప్లో భారత్కు మరో స్వర్ణం దక్కింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో రుద్రాంక్ష్ పాటిల్, కిరణ్ అంకుష్ జాదవ్, అర్జున్తో కూడిన భారత పురుషుల జట్టు ఫైనల్లో 16-10తో చైనాను ఓడించి పసిడి పతకం గెలుచుకుంది. రుద్రాంక్ష్కు ఈ టోర్నీలో ఇది రెండో స్వర్ణం.
10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలోనూ రుద్రాంక్ష్ బంగారు పతకం నెగ్గాడు. ప్రస్తుతం పట్టికలో భారత్ 5 స్వర్ణాలు, ఒక రజతం, 5 కాంస్యాలతో తన రెండో స్థానంలో కొనసాగుతున్నది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో భారత జట్టు ఫైనల్కు చేరడంతో మరో పతకం దక్కడం ఖాయమైంది.