బ్యాడ్మింటన్లో భారత్కు నిరాశే ఎదురైంది. మంగళవారం అర్ధరాత్రి జరిగిన టీమ్ ఈవెంట్ ఫైనల్లో భారత్ 1-3 తేడాతో మలేషియా చేతిలో ఓడి రజత పతకంతో సరిపెట్టుకుంది. ఆట విషయానికొస్తే..తొలుత జరిగిన పురుషుల డబుల్స్లో భారత స్టార్ ద్వయం సాత్విక్సాయిరాజ్, చిరాగ్శెట్టి 18-21, 15-21తో మలేషియా జోడీ టెంగ్ఫాంగ్ ఆరోన్, వుయి యిక్ సోక్ చేతిలో ఓటమిపాలైంది. సుదీర్ఘ ర్యాలీలతో హోరాహోరీగా సాగిన మ్యాచ్లో మలేషియా జంటకు సాత్విక్, చిరాగ్ జంట దీటైన పోటీనివ్వలేకపోయింది. ఆ తర్వాత జరిగిన మహిళల సింగిల్స్లో పీవీ సింధు 22-20, 21-17తో గోహ్ జిన్ వీపై చెమటోడ్చి నెగ్గింది. తన(7) కంటే తక్కువ ర్యాంక్(60)లో ఉన్న మలేషియా షట్లర్పై గెలిచేందుకు సింధు చెమటోడ్చాల్సి వచ్చింది. పురుషుల సింగిల్స్లో సీనియర్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్కు నిరాశే ఎదురైంది. తైజి యంగ్తో జరిగిన మ్యాచ్లో శ్రీకాంత్ 19-21, 21-6, 16-21తో ఓటమి పాలయ్యాడు. అప్పటికే 2-1 ఆధిక్యంలో ఉన్న మలేషియా అదే జోరు కొనసాగిస్తూ మహిళల డబుల్స్లో తినా మురళీధరన్, కూంగ్ లీ పెర్లీ ద్వయం 21-18, 21-17తో భారత జోడీ గాయత్రి గోపీచంద్, త్రిసా జాలీపై గెలిచి పసిడి పతకాన్ని ఖాతాలో వేసుకుంది.