జింజు(కొరియా) : ఆసియన్ వెయిట్లిఫ్టింగ్ చాంపియన్షిప్ 73 కిలోల విభాగంలో భారత్కు స్వర్ణ, రజతాలు దక్కాయి. ఫైనల్ చేరిన భారత లిఫ్టర్లు అజిత్ నారాయణ, అచింత సియోలి తొలి రెండు స్థానాల్లో నిలిచారు. అజిత్ స్నాచ్లో 140కి, క్లీన్ అండ్ జర్క్లో 168కి.గ్రా. ఎత్తి మొత్తంగా 307కిలోలతో అగ్రస్థానం దక్కించుకున్నాడు. జాతీయ చాంపియన్ అయిన అజిత్ స్నాచ్లో తొలుత 135కి, రెండో ప్రయత్నంలో 1239కిలోలు. ఎత్తాడు. మూడో ప్రయత్నంలో 141కిలోలు ప్రయత్నించి విఫలమయ్యాడు. క్లీన్ అండ్ జర్క్లో తొలి రెండు ప్రయత్నాలలో 164, 168 కిలోలను సునాయాసంగా ఎత్తి మూడో ప్రయత్నంలో 171కిలోలతో విఫలమయ్యా డు. కాగా అచింత స్నాచ్లో 140కిలోలు క్లీన్ అండ్ జర్క్లో 165కిలోలతో రెండో స్థానంలో నిలిచాడు.
2021 జూనియర్ ప్రపంచ చాంపియన్షిప్లో రజతం సాధించిన అచింత స్నాచ్లో అత్యుత్తమంగా 140 కిలలోను ఎత్తాడు. క్లీన్ అండ్ జర్క్లో 169 కిలోలతో171 కిలోలతో ఎత్తేందుకు ప్రయత్నించి విఫమయ్యాడు. ఈ చాంపియన్షిప్లో ప్రతి విభాగంలో విడివిడిగా పతకాలు అందజేస్తారు. ఒలింపిక్స్లో అన్నింటికి కలిపి ఒకే పతకం ప్రదానం చేస్తారు. పారిస్ ఒలింపిక్స్కు ఇది రెండో అర్హత టోర్నీ. పారిస్ ఒలింపిక్స్లో వెయిట్లిఫ్టింగ్లో 14 విభాగాలను 10 విభాగాలకు కుదించారు. 73 కిలోల విభాగం ఒలింపిక్స్లో భాగం కానందుకు లిఫ్టర్లు గాయాలపాలు కాకుండా జాగ్రత్త వహించారు. ఈ చాంపియన్షిప్లో భారత్కు బింద్యారాణి దేవి, జెరెమి లాల్రినుంగ కూడా రజత పతకాలు సాధించారు.