న్యూఢిల్లీ: బహ్రెయిన్ పారా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ను భారత్ ఘనంగా ముగించింది. మనామా వేదికగా జరిగిన టోర్నీలో భారత పారా షట్లర్లు మొత్తం 23 పతకాలు (7 స్వర్ణాలు, 3 రజతాలు, 13 కాంస్యాలు) కొల్లగొట్టారు. వారం పాటు సాగిన ఈ టోర్నీలో మనీషా రామ్దాస్ రెండు స్వర్ణాలు కొల్లగొట్టగా.. భారత స్టార్ పారా షట్లర్లు ప్రమోద్ భగత్, తరుణ్ ధిల్లాన్తో పాటు నిత్యశ్రీ సుమతి శివాన్, ధినగరన్ పాండురంగన్, శివరాజన్ సొలైమలై పసిడి పతకాలు చేజిక్కించుకున్నారు. ఇదే ఉత్సాహంతో మన షట్లర్లు దుబాయ్ వేదికగా మంగళవారం నుంచి ప్రారంభం కానున్న ఫాజ్జా టోర్నీలో సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో ప్రమోద్-మనీషా జోడీ 21-14, 21-11 తేడాతో థాయిలాండ్ జంటను చిత్తు చేసింది. మహిళల డబుల్స్లో మన్దీప్ కౌర్-మనీషా 21-11, 21-11 భారత్కే చెందిన పాలక్ కోహ్లీ-పరుల్ పర్మార్ జోడీపై నెగ్గగా.. సింగిల్స్ ఫైనల్లో ఆసియా యూత్ గేమ్స్ చాంపియన్ నిత్యశ్రీ 21-15, 21-15 తేడాతో రేచల్ చూంగ్ (ఇంగ్లండ్)ను చిత్తు చేసింది.