మాలే: దక్షిణాసియా ఫుట్బాల్ సమాఖ్య (సాఫ్) చాంపియన్షిప్ను భారత్ 8వ సారి సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో సునీల్ ఛెత్రీ సేన 3-0తో నేపాల్ను చిత్తు చేసింది. భారత్ తరఫున ఛెత్రీ (49వ నిమిషంలో), సురేశ్ సింగ్ (50వ ని.లో), సాహల్ అబ్దుల్ (90వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. ఫేవరెట్గా బరిలోకి దిగిన భారత్ ఆద్యాంతం ఆధిపత్యం కనబర్చగా.. ఛెత్రీ సేనకు నేపాల్ ఏమాత్రం పోటీనివ్వలేకపోయింది. తొలి అర్ధభాగంలో ఇరు జట్లు గోల్ కొట్టలేకపోగా.. రెండో సగంలో భారత్ రెచ్చిపోయింది.