IND vs SL : భారీ లక్ష్య ఛేదనలో శ్రీలంక కష్టాల్లో పడింది. భారత బౌలర్లు చెలరేగడంతో15 ఓవర్ల లోపే మూడు వికెట్లు కోల్పోయింది. ఉమ్రాన్ ఇండియాకు మూడో వికెట్ అందించాడు. అతని బౌలింగ్లో చరిత అసలంక (23) కీపర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అంతకు ముందు తొలి రెండు వికెట్లు పడగొట్టి సిరాజ్ లంకను దెబ్బతీశాడు. ఆవిష్క ఫెర్నాండో(5), కుశాల్ మెండిస్(0)లను పెవిలియన్ పంపాడు. ప్రస్తుతం 16 ఓవర్లకు శ్రీలంక మూడు వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేసింది. నిస్సంకా 35, ధనంజయ డిసిల్వా 8 రన్స్తో క్రీజులో ఉన్నారు. భారత స్పిన్నర్లు అక్షర్, యజువేంద్ర చాహల్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుండడంతో వీళ్లు ఆచితూచి ఆడుతున్నారు.
తొలి వన్డేలో టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ దసున్ షనక ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 373 రన్స్ చేసింది. విరాట్ కోహ్లీ (113) సెంచరీ చేయడంతో పాటు ఓపెనర్లు రోహిత్ (83), శుభ్మన్ గిల్ (70) రాణించారు.