IND vs SL : రెండో వన్డేలో శ్రీలంక 215 పరుగులు ఆలౌట్ అయింది. ఓపెనర్ నువనిదు ఫెర్నాండో (50) టెయిలెండర్లు వెల్లలాగే (32), వసనిందు హసరంగ (21), చమిక కరుణరత్నే(17) రాణించడంతో ఆ జట్టు రెండొందలకు పైగా పరుగులు చేయగలిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లంకను సిరాజ్ దెబ్బతీశాడు. ఐదోఓవర్లో ఓపెనర్ ఆవిష్క ఫెర్నాండోను అవుట్ చేశాడు. ఆ తర్వాత చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కీలకమైన కుశాల్ మెండిస్ (34), దసున్ షనక (2), చరిత అసలంక (15) వికెట్లు తీసి లంక నడ్డి విరిచాడు. 177 పరుగుల వద్ద లంక 8 వికెట్లు కోల్పోయింది. దునిత్ వెల్లలాగే , కసున్ రజిత తొమ్మిదో వికెట్కు 38రన్స్ జోడించారు. సిరాజ్ 40 ఓవర్లో వెల్లలాగే, కుమరను అవుట్ చేయడంతో లంక ఇన్నింగ్స్ ముగిసింది.
ఈ మ్యాచ్లో ఆల్రౌండర్ అక్షర్ పటేల్ అద్భుతంగా ఫీల్డింగ్ చేశాడు. ఒక వికెట్ పడగొట్టిన అక్షర్ పటేల్ మూడు క్యాచ్లు అందుకున్నాడు. ఉమ్రాన్ మాలిక్ రెండు, అక్షర్ పటేల్కు తలా ఒక వికెట్లు తీశారు. తొలి వన్డేలో గెలిచి ఊపు మీదున్న భారత్ ఈ వన్డేలోనూ గెలుపుపై కన్నేసింది. మొదటి వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ(113)తో కదం తొక్కాడు. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ అర్థశతకాలో రాణించారు. ఈ మ్యాచ్లోనూ వీళ్లు మళ్లీ చెలరేగితే సిరీస్ టీమిండియా సొంతం కానుంది.