Team India | శ్రీలంకపై జరిగిన రెండో టీ-20 మ్యాచ్లో టీం ఇండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రోహిత్ శర్మ సారధ్యంలో టీం ఇండియా మరో సిరీస్ను సొంతం చేసుకున్నది. శనివారం జరిగిన మ్యాచ్లో 184 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన టీం ఇండియా 17 బంతులు మిగిలి ఉండగానే విజయ తీరాలకు చేరింది. శ్రేయాస్ అయ్యర్ 74, సంజూ శామ్సన్ 39, రవీంద్ర జడేజా 45 పరుగులు చేయడం ద్వారా జట్టు విజయంలో కీలకగా వ్యవహరించారు. ప్రారభంలో సారధి రోహిత్ శర్మను దుశ్మంత చమీరా కేవలం ఒక్క పరుగుకే పెవిలియన్ దారి పట్టించాడు.
పవర్ ప్లేలోనే ఇషాన్ కిషాన్ను 16 పరుగులకు ఆలౌట్ చేయడంతో టీం ఇండియా కష్టాల్లో చిక్కుకుంది. తర్వాత బ్యాటింగ్కు వచ్చిన శ్రేయాస్ అయ్యర్, సంజూ శామ్సన్ పరిస్థితిని చక్కదిద్దారు. శ్రేయాస్, శామ్సన్ భాగస్వామ్యం.. తర్వాత రవీంద్ర జడేజా లక్ష్యం పూర్తి చేశారు. గత నవంబర్లో పూర్తికాలం సారధిగా రోహిత్ శర్మను ప్రకటించిన తర్వాత టీం ఇండియాకు ఇది మూడో సిరీస్. ధర్మశాలలో మూడో టీ-20 మ్యాచ్ జరుగనున్నది. ధర్మశాల మ్యాచ్ను కూడా గెలుచుకుని సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని రోహిత్ సేన ఎదురుచూస్తున్నది.