టీమిండియాతో పాటు పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. ఈనెల 27 నుంచి మొదలుకానున్న ఆసియా కప్-2022కు టికెట్ల విక్రయాన్ని రేపటి (ఆగస్టు 15) నుంచి ప్రారంభించనున్నట్టు ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) తెలిపింది. గత వారం రోజులుగా సోషల్ మీడియా వేదికగా అభిమానులు ఇదే విషయమై ఆందోళన వ్యక్తం చేస్తుండగా తాజాగా ఏసీసీ స్పందించింది.
గతవారం సామాజిక మాధ్యమాల వేదికగా పలువురు క్రికెట్ అభిమానులు.. ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఇంకా టికెట్ల అమ్మకాన్ని (ఆన్లైన్, స్టేడియం వద్ద) ప్రారంభించలేదని ఏసీసీ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. తాము ఏసీసీకి మెయిల్ చేసినా, నేరుగా అధికారులను ప్రశ్నించినా సమాధానం లేదని సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదన వెల్లగక్కారు. ఈ నేపథ్యంలో ఏసీసీ తాజాగా స్పందిస్తూ.. టికెట్ల విక్రయాన్ని ఆగస్టు 15 నుంచి ప్రారంభిస్తున్నట్టు తెలిపింది.
‘ఆసియా కప్ టికెట్ విక్రయాలు ఆగస్టు 15 నుంచి ప్రారంభంకాబోతున్నాయి. టికెట్లను బుక్ చేసుకోవడానికి సోమవారం నుంచి platinumlist ను సందర్శించండి..’ అని ట్విటర్ వేదికగా ప్రకటించింది. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
ఈనెల 27న ప్రారంభం కానున్న ఆసియా కప్లో తొలి మ్యాచ్ శ్రీలంక, ఆఫ్గానిస్తాన్ మధ్య జరుగనున్నది. 28న భారత్-పాక్ మ్యాచ్ జరగాల్సి ఉంది. ఆరుజట్లు పాల్గొననున్న ఈ మెగా టోర్నీలో ఇప్పటికే భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆప్గానిస్తాన్లు నేరుగా అర్హత సాధించాయి. ఆరో జట్టు కోసం క్వాలిఫయింగ్ రౌండ్లో యూఏఈ, సింగపూర్, హాంకాంగ్, కువైట్ తలపడతాయి.
Tickets🎟for Asia Cup 🏆2022 go up for sale on August 15th 🗓 Visit the link below from Monday onwards to book your tickets:https://t.co/BjfeZVCIxi pic.twitter.com/Q8y9mwj6Z5
— AsianCricketCouncil (@ACCMedia1) August 13, 2022