ఆక్లాండ్: న్యూజిలాండ్తో జరుగుతున్న మొదటి వన్డేలో టీమ్ఇండియా ఓపెనర్లు అర్ధ సెంచరీలతో అదరగొట్టారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన భారత్కు ఓపెనర్లు శుభ్మన్ గిల్, ధవన్ శుభారంభం ఇచ్చారు. కివీస్ బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొంటూ హాఫ్ సెంచరీలు పూర్తిచేసుకున్నారు. మొదట ధవన్ 63 బంతుల్లో 50 పరుగులు పూర్తిచేయగా, అనంతరం గిల్ 64 బాల్స్లో 50 మార్క్ అందుకున్నాడు. మొత్తంగా గిల్ వన్డేల్లో నాలుగో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. అయితే 50 రన్స్ పూర్తిచేసిన వెంటనే కివీస్ బౌలర్ ఫెర్గూసన్ బౌలింగ్లో ఔటయ్యాడు. అనంతరం శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్కు వచ్చాడు. ప్రస్తుతం భారత్ 23 ఓవర్లలో వికెట్ నష్టానికి 124 పరుగులు చేసింది.
Fourth ODI half-century for Shubman Gill 🙌
Watch the #NZvIND ODI series LIVE on https://t.co/CPDKNxoJ9v (in select regions) 📺
📝 Scorecard: https://t.co/KsjLsSQ2eQ pic.twitter.com/9GKwgpDbjW
— ICC (@ICC) November 25, 2022