India vs England | వన్డే ప్రపంచకప్ (ICC Cricket World Cup 2023)లో భాగంగా నేడు భారత జట్టు ఇంగ్లండ్తో తలపడనుంది. ఇక ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్ల్లో నెగ్గిన రోహిత్ సేన సిక్సర్ కొట్టేందుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్కు స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా అందుబాటులో లేకపోవడం తప్ప భారత జట్టుకు పెద్దగా సమస్యలేమీ లేకపోగా.. ప్రపంచ చాంపియన్ ఇంగ్లండ్ మాత్రం గాడిన పడేందుకు నానా తంటాలు పడుతున్నది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుని భారత్కు బ్యాటింగ్ అప్పగించింది. ఇక ఈ మ్యాచ్ లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభంకానుంది.
తుది జట్లు
భారత్ : రోహిత్ శర్మ (సి), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వి), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
ఇంగ్లాండ్ : జానీ బెయిర్స్టో, డేవిడ్ మలన్, జో రూట్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్(w/c), లియామ్ లివింగ్స్టోన్, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, డేవిడ్ విల్లీ, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.