ఢాకా: బంగ్లాదేశ్ టూర్లో ఆతిథ్య జట్టుతో మూడు వన్డేల సిరీస్ ఆడుతున్న భారత్.. తొలి వన్డేలో బ్యాటర్లు తీవ్రంగా నిరుత్సాహపర్చారు. కేఎల్ రాహుల్ (73) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. 11వ ఓవర్ ముగిసేసరికి భారత్ 3 వికెట్లు కోల్పోయి కేవలం 49 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ తర్వాత కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేసినా కాసేపటికే శ్రేయాస్ కూడా పెవిలియన్ బాటపట్టాడు.
ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ కాసేపు కేఎల్ రాహుల్కు జతగా నిలిచాడు. కానీ 19 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సుందర్ కూడా ఔటయ్యాడు. సుందర్ ఔటైన తర్వాత షాబాజ్ అహ్మద్, శార్ధూల్ ఠాకూర్, దీపక్ చాహర్ వరుసగా ఇలా వచ్చి అలా పెవిలియన్కు చేరారు. దాంతో భారత్ 34.4 ఓవర్లలో భారత్ 8 వికెట్లు కోల్పోయి కేవలం 156 పరుగులకు చేరింది. ఆ తర్వాత భారాన్నంతా తనపై వేసుకున్న కేఎల్ రాహుల్.. ఊపుగా ఆడుతూ జట్టు స్కోరు 178 ఉన్నప్పుడు ఔటయ్యాడు.