IND vs BAN | మీర్పూర్: ఉత్కంఠ భరితంగా సాగిన స్వల్ప స్కోర్ల పోరులో భారత మహిళల జట్టు విజయఢంకా మోగించింది. ఫలితంగా బంగ్లాదేశ్తో జరుగుతున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది. మొదట భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 95 పరుగులు చేసింది.
షఫాలీ వర్మ (19) టాప్ స్కోరర్ కాగా.. కెప్టెన్ హర్మన్ప్రీత్ (0), జెమీమా రోడ్రిగ్స్ (8), స్మృతి మందన (13), హర్లీన్ డియోల్ (6) విఫలమయ్యారు. బంగ్లా బౌలర్లలో సుల్తానా ఖాతూన్ 3 వికెట్లు పడగొట్టింది. అనంతరం లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 87 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టు కెప్టెన్ నిగార్ సుల్తానా (38) ఒక్కతే రెండంకెల స్కోరు చేయగా.. మిగిలిన వాళ్లంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ దీప్తి శర్మ, షఫాలీ వర్మ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.