నవీ ముంబై: కంగారూలతో వన్డేల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన భారత మహిళల జట్టు టీ20 సిరీస్ కోసం సిద్ధమైంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శుక్రవారం ఇరు జట్ల మధ్య తొలి పోరు జరగనుంది. ఈ ఏడాది చివర్లో పొట్టి ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో ఈ సిరీస్ టీమ్ఇండియాకు కీలకం కానుంది.
ఆస్ట్రేలియాతో వన్డేల్లో వైట్వాష్కు గురైన హర్మన్ప్రీత్ బృందం ఆ పరాజయాలను పక్కన పెట్టి సత్తాచాటాలని భావిస్తున్నది. హర్మన్, స్మృతి, జెమీమా,రిచా, షఫాలీ, పూజ, రాణిస్తే..ఆస్ట్రేలియాపై విజయం సాధ్యమవుతుంది.