హైదరాబాద్ : ఈ నెల 25వ తేదీన టీ20 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ల్లో భాగంగా ఇండియా – ఆస్ట్రేలియా జట్ల మధ్య ఉప్పల్ స్టేడియం వేదికగా మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్కు రాచకొండ పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ రోజు సాయంత్రం 4 గంటల నుంచి ఉప్పల్ పరిసరాలలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ వెల్లడించారు.
కెమెరాలు, సెల్ఫీస్టిక్స్ సిగరెట్లు, అగ్గిపెట్టెలు, పదునైన ఆయుధాలు, ఆల్కహాల్, తిను బండారాలు, వాటర్ బాటిల్స్, హెల్మెట్లను లోపలికి అనుమతించమని సీపీ స్పష్టం చేశారు. ఇక క్రికెట్ అభిమానులను సాయంత్రం 4 గంటల నుంచి స్టేడియంలోకి అనుమతిస్తామని చెప్పారు. టిక్కెట్లు ఉన్న వారు మాత్రమే రావాలని సూచించారు.