ODI World Cup | వన్డే ప్రపంచకప్లో భారత్ బోణీ కొట్టింది. ఆస్ట్రేలియాపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెండు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయినప్పటికీ విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఆచితూచి ఆడుతూ భారత్ను విజయతీరాలకు చేర్చారు. చివరి వరకూ మ్యాచ్ను నిలబెట్టిన విరాట్ కోహ్లీ 85 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. అప్పటికి భారత్ 167 పరుగులు చేసింది. అయితే కోహ్లీ ఔటయ్యాక క్రీజులోకి పాండ్యా సహకారంతో రాహుల్.. చివరి బంతికి సిక్స్ కొట్టి భారత్కు విజయాన్నిందించాడు.
ఆస్ట్రేలియా సారధి పాట్ కమ్మిన్స్ బౌలింగ్ లో 42వ ఓవర్ రెండో బంతిని కేఎల్ రాహుల్ స్టాండ్స్ లోకి పంపి జట్టును విజయ తీరాలకు చేర్చాడు.
41వ ఓవర్ లో కేఎల్ రాహుల్ దూకుడు పెంచాడు. గ్లెన్ మ్యాక్స్ వెల్ బౌలింగ్ లో చెలరేగిపోయాడు. తొలి బంతిని ఓవర్ లాంగాఫ్ మీదుగా బంతిని స్టాండ్స్ లోకి పంపడంతో తొలి సిక్సర్ నమోదు చేశాడు. ఆ వెంటనే మిడాఫ్ మీదుగా బౌండరీకి మళ్లించాడు. 41వ ఓవర్ లో ఏకంగా 13 పరుగులు టీం ఇండియా ఖాతాలో చేరాయి.
తొలుత టీం ఇండియా బ్యాటర్లను కట్టడి చేసిన జోష్ హేజిల్ వుడ్ బౌలింగ్ లో 40వ ఓవర్ ఐదో బంతిని హార్దిక్ పాండ్యా ఓవర్ లాంగాఫ్ మీదుగా పెవిలియన్ బాట పట్టించాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్ లో ఇదే తొలి సిక్సర్.
విజయం దిశగా అడుగులేస్తున్న టీం ఇండియాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. 38వ ఓవర్ లో హేజిల్ వుడ్ వేసిన నాలుగో బంతిని లబుషేన్ క్యాచ్ పట్టడంతో కోహ్లీ ఔటయ్యాడు. ఔటయ్యే సమయానికి కోహ్లీ 85 పరుగులు చేశాడు.
ఆడం జంపా వేసిన 37వ ఓవర్ లో ఎనిమిది పరుగులు వచ్చాయి. రాహుల్ నాలుగు పరుగులు, కోహ్లీ నాలుగు పరుగులు చేశారు.
తొలుత గడగడలాడించిన జోష్ హేజిల్ హుడ్ బౌలింగ్ లో కేఎల్ రాహుల్ 36వ ఓవర్ ఐదో బంతిని బౌండరీ బాట పట్టించాడు. అంతకుముందు రెండు పరుగులు, తర్వాత ఒక సింగిల్ తీశాడు. దీంతో 36 ఓవర్లు ముగిసే సమయానికి టీం ఇండియా మూడు వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 71, విరాట్ కోహ్లీ 81 పరుగులతో క్రీజ్ లో కొనసాగుతున్నారు.
సారధి రోహిత్ శర్మతోపాటు మరో ఓపెనర్ ఇషాన్ కిషన్, ఫస్ట్ డౌన్ శ్రేయాస్ అయ్యర్ డకౌట్ కావడంతో కష్టాల్లో చిక్కుకున్న టీం ఇండియాను గట్టెక్కించే బాధ్యత కోహ్లీ, రాహుల్ తలకెత్తుకున్నారు. 36వ ఓవర్ లో హేజిల్ వుడ్ వేసిన తొలి బంతికి కోహ్లీ సింగిల్ తీయడంతో నాలుగో వికెట్ భాగస్వామ్యానికి 150 పరుగులు జత చేశారు. అప్పటికీ క్రీజ్ లో కోహ్లీ 81, రాహుల్ 64 పరుగులతో కొనసాగుతున్నారు.
ఆడం జంపా వేసిన 35వ ఓవర్ లో నాలుగు బంతుల్లో కోహ్లీ, రాహుల్ చెరో రెండు సింగిల్స్ తీయడంతో జట్టు స్కోర్ 150కి చేరింది.
మిచెల్ స్టార్క్ బౌలింగ్లో 34వ ఓవర్ ఐదో బంతిని స్క్వేర్ కట్ ద్వారా బౌండరీ దాటించిన కోహ్లీ, మరో రెండు సింగిల్స్ తీశాడు. రాహుల్ సింగిల్ తీయడంతో 34వ ఓవర్ లో ఏడు పరుగులు వచ్చాయి. విరాట్ కోహ్లీ 77, కేఎల్ రాహుల్ 62 పరుగులతో క్రీజ్ లో కొనసాగుతున్నారు. టీం ఇండియా స్కోర్ 146 /3.
భారత్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఆచితూచీ ఆడుతూనే దూకుడు పెంచారు. ఆడం జంపా బౌలింగ్లో 33 ఓవర్ తొలి బంతిని కవర్ మీదుగా బౌండరీకి మళ్లించాడు కోహ్లీ. విరాట్ కోహ్లీ మరో రెండు సింగిల్స్, రాహుల్ ఒక సింగిల్ తీశాడు. దీంతో 33వ ఓవర్ లో ఏడు పరుగులు వచ్చాయి.
తొలుత గడగడలాడించిన మిచెల్ స్టార్క్ బౌలింగ్లో 32వ ఓవర్లో కేఎల్ రాహుల్ చెలరేగిపోయాడు. నాలుగో బంతిని ఎక్స్ట్రా కవర్ మీదుగా బౌండరీ బాట పట్టించాడు. తొలి బంతికి రెండు పరుగులు చేసిన కోహ్లీ.. మూడో బంతికి సింగిల్ తో సరిపెట్టాడు. దీంతో 32 వ ఓవర్ లో టీం ఇండియాకు 8 పరుగులు వచ్చాయి. టీం ఇండియా స్కోర్ 132 /3.
టీం ఇండియా బ్యాటర్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఆచీతూచీ బ్యాటింగ్ చేస్తున్నారు. గ్లెన్ మ్యాక్స్వెల్ వేసిన 31వ ఓవర్ లో చెరో రెండు సింగిల్స్ తీశారు. దీంతో టీం ఇండియా స్కోర్ 124/3.
కమిన్స్ వేసిన 30వ ఓవర్ లో రాహుల్ ఒక సింగిల్ మాత్రమే తీశాడు. విరాట్ కోహ్లీ 60, కేఎల్ రాహుల్ 54 పరుగులతో క్రీజ్ లో కొనసాగుతున్నారు. వరుసగా ముగ్గురు బ్యాటర్లు డకౌట్ కావడంతో జట్టు పరిస్థితి చక్కదిద్దే బాధ్యతను కోహ్లీ, రాహుల్ భుజాలకెత్తుకున్నట్లు కనిపిస్తున్నది. 30 ఓవర్లకు టీం ఇండియా 120/3. ఆస్ట్రేలియాపై గెలవాలంటే టీం ఇండియా 20 ఓవర్లలో 80 పరుగులు చేయాలి.
కమిన్స్ వేసిన 26వ ఓవర్ మూడో బంతిని సింగిల్ పరుగు తీసి అర్థ సెంచరీ చూశాడు విరాట్ కోహ్లీ. కోహ్లీ 12 పరుగుల వద్ద మిచెల్ మార్ష్ క్యాచ్ వదిలేశాడు. తదుపరి 28వ ఓవర్లో కమిన్స్ వేసిన తొలి బంతిని సింగిల్ పరుగు తీసి అర్థ శతకం కేఎల్ రాహుల్ పూర్తి చేశాడు. 29 ఓవర్లు ముగిసే సరికి టీం ఇండియా మూడు వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది.
మిచెల్ స్టార్క్ వేసిన 19 వ ఓవర్లో కోహ్లీ, రాహుల్ చెరో రెండు సింగిల్స్ తో సరిపెట్టారు.
19 ఓవర్లు ముగిసే సమయానికి టీం ఇండియా స్కోర్ 73/3.
ఆడం జంపా వేసిన 18 వ ఓవర్లో కేఎల్ రాహుల్ వరుసగా చివరి మూడు బంతులను బౌండరీకి పంపించాడు. అంతకుముందు తొలి బంతితో విరాట్ కోహ్లీ సింగిల్ తీశాడు. 18 ఓవర్లు ముగిసే సమయానికి టీం ఇండియా స్కోర్ 69/3.
మిచెల్ స్టార్క్ వేసిన 17 వ ఓవర్లో కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ చెరో రెండు సింగిల్స్ తీశారు. ఆస్ట్రేలియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుండటంతో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఆచితూచి ఆడుతూ వికెట్ కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. 17 ఓవర్లు ముగిసే సమయానికి టీం ఇండియా స్కోర్ 56/3.
గ్లెన్ మ్యాక్స్ వెల్ వేసిన 16 వ ఓవర్ లో రాహుల్ ఒక సింగిల్, రెండు పరుగులతో సరిపెట్టాడు. దీంతో టీం ఇండియా జట్టు స్కోర్ 52/3.
కామరూన్ గ్రీన్ వేసిన 15వ ఓవర్లో చివరి రెండు బంతులను బౌండరీ బాట పట్టించాడు విరాట్ కోహ్లీ. రెండో బౌండరీ కొట్టడానికి 50 బంతులు ఆడాడు కోహ్లి. కామరూన్ గ్రీన్ వేసిన ఐదో బంతిని మిడ్ వికెట్ మీదుగా బౌండరీకి తరలించాడు. ఆరో బంతిని సైతం మిడ్ వికెట్ మీదుగా ఫోర్ గా మలిచాడు. దీంతో 15 ఓవర్లు ముగిసే సరికి టీం ఇండియా స్కోర్ 49/3. క్రీజ్ లో విరాట్ కోహ్లీ 31, కేఎల్ రాహుల్ 15 పరుగులతో ఆడుతున్నారు.
No 4 batsman has to absorb the pressure !! Need better thinking from @ShreyasIyer15 when team is trying to rebuild their innings ! Still don’t understand why @klrahul is not batting at no 4 ! After scoring a 100 against Pakistan ! Dropping @imVkohli might cost australia big time…
— Yuvraj Singh (@YUVSTRONG12) October 8, 2023
గ్లెన్ మ్యాక్స్ వెల్ బౌలింగ్ లో 14వ ఓవర్ లోనూ మూడు సింగిల్స్ వచ్చాయి. రెండు విరాట్ కోహ్లీ, ఒక సింగిల్ కేఎల్ రాహుల్ తీశారు. దీంతో టీం ఇండియా స్కోర్ 41/3.
కామ్ గ్రీన్ బౌలింగ్ లో 13వ ఓవర్ లో మూడు సింగిల్స్ వచ్చాయి. రెండు విరాట్ కోహ్లీ, ఒక సింగిల్ కేఎల్ రాహుల్ తీశారు. దీంతో టీం ఇండియా స్కోర్ 38/3.
గ్లెన్ మాక్స్వెల్ బౌలింగ్లో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ చెరో సింగిల్ తీశారు. దీంతో భారత్ స్కోర్ 35/3.
11వ ఓవర్లో పాట్ కమిన్స్ వేసిన నాలుగో బంతిని కేఎల్ రాహుల్ బౌండరీ బాట పట్టించాడు. తిరిగి చివరి బంతిని సింగిల్ గా మార్చాడు. దీంతో 11 ఓవర్ లో ఆరు పరుగులు వచ్చాయి. టీం ఇండియా స్కోర్ 33/3. 18 పరుగులతో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ 12 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.
పది ఓవర్లు ముగిసే సమయానికి టీం ఇండియా స్కోర్ 27/3. విరాట్ కోహ్లీ 17, కేఎల్ రాహుల్ ఏడు పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. దీంతో టీం ఇండియా బ్యాటింగ్ పవర్ ప్లే పూర్తయింది.
పాట్ కమిన్స్ వేసిన తొమ్మిదో ఓవర్లో కోహ్లీ మూడు సింగిల్స్, రాహుల్ రెండు సింగిల్స్ తీశారు.
జోష్ హజిల్ వుడ్ బౌలింగ్ లో కోహ్లీ, రాహుల్ జాగ్రత్తగా ఆడుతున్నారు. ఎనిమిదో ఓవర్ ఐదో బంతిని ఆడిన కోహ్లీ సింగిల్ తో సరిపెట్టాడు.
కమిన్స్ వేసిన ఏడు ఓవర్లో కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ చెరో సింగిల్తో సరి పెట్టుకున్నారు.
దీంతో ఏడో ఓవర్ ముగిసే సమయానికి భారత్ స్కోర్ 20 /3. క్రీజ్ లో కేఎల్ రాహుల్ 5, విరాట్ కోహ్లీ 12 పరుగులతో కొనసాగుతున్నారు.
హజిల్ వుడ్ బౌలింగ్లో ఆచితూచి ఆడుతున్న విరాట్ కోహ్లీ.. ఐదో బంతిని బౌండరీ బాట పట్టించాడు. చివరి బంతితో రెండు పరుగులు రాబట్టాడు. దీంతో ఆరో ఓవర్ ముగిసే సమయానికి భారత్ స్కోర్ 18 /3. క్రీజ్ లో కేఎల్ రాహుల్ 4, విరాట్ కోహ్లీ 11 పరుగులతో కొనసాగుతున్నారు.
వరుసగా టీం ఇండియా మూడు వికెట్లు కోల్పోవడంతో బ్యాటర్లు ఆచితూచి ఆడుతున్నట్లు కనిపిస్తున్నది. ఐదో ఓవర్లో మిచెల్ స్టార్క్ వేసిన ఐదో బంతిని సింగిల్గా మలిచాడు విరాట్ కోహ్లీ. అంతకుముందు రెండో బంతి వైడ్ కావడంతో ఐదో ఓవర్ లో రెండు పరుగులు వచ్చాయి. ఐదో ఓవర్ ముగిసే సమయానికి టీం స్కోర్ 12/3. క్రీజ్ లో విరాట్ కోహ్లీ 5, కేఎల్ రాహుల్ నాలుగు పరుగులతో ఆడుతున్నారు.
ఆస్ట్రేలియా బౌలర్ హజిల్ వుడ్.. టీం ఇండియా బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఐదో బంతితో విరాట్ కోహ్లీ సింగిల్ తీస్తే.. చివరి బంతిని కేఎల్ రాహుల్ ఫోర్ గా మలిచి, తొలిసారి బంతిని బౌండరీకి మళ్లించాడు. భారత్ స్కోర్ 10/3. నాలుగో ఓవర్ ముగిసే సమయానికి కోహ్లీ నాలుగు, కేఎల్ రాహుల్ నాలుగు పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.
తొలి రెండు ఓవర్లలో ఇద్దరూ ఓపెనర్లు, ఫస్ట్ డౌన్ వికెట్ కోల్పోయిన తర్వాత విరాట్ కోహ్లీ మూడు సింగిల్స్ తో సరి పెట్టాడు. దీంతో మూడో ఓవర్లో మూడు పరుగులు వచ్చాయి.
సఫారీలను తక్కువ స్కోర్కే కట్టడి చేసిన సంతోషం టీం ఇండియాకు మిగిలేలా లేదు. తొలి ఓవర్లో అనవసరమైన బంతిని ఆడి ఓపెనర్ ఇషాన్ కిషన్ డకౌట్ కాగా, రెండో ఓవర్లో హజిల్ వుడ్ వేసిన మూడో బంతికి రోహిత్ శర్మ ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. దీంతో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. ముగ్గురూ ఒక్క సింగిల్ తీయకుండానే డకౌట్ అయ్యారు.
రెండో ఓవర్లో హజిల్ వుడ్ చేతిలో ఇద్దరు బ్యాటర్లు పెవిలియన్ బాట పట్టారు. సారధి రోహిత్ శర్మ మూడో బంతికి ఎల్బీడబ్ల్యూతో పెవిలియన్ బాట పట్టగా, చివరి బంతిని ఆడబోయి శ్రేయాస్ అయ్యర్.. వార్నర్ చేతికి అందించాడు. దీంతో టీం ఇండియా వరుసగా మూడు వికెట్లు కోల్పోయింది.
సఫారీలను తక్కువ స్కోర్కే కట్టడి చేసిన సంతోషం టీం ఇండియాకు మిగిలేలా లేదు. రెండో ఓవర్లో హజిల్ వుడ్ వేసిన మూడో బంతికి రోహిత్ శర్మ ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. దీంతో భారత్ రెండో వికెట్ కోల్పోయింది.
సఫారీలతో జరుగుతున్న మ్యాచ్లో టీం ఇండియాకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఓపెనర్గా వచ్చిన ఇషాన్ కిషాన్ డకౌట్ అయ్యాడు. తొలి ఓవర్లో మిచెల్ స్టార్క్ వేసిన నాలుగో బంతిని అనవసరంగా ఇషాన్ కిషన్ టచ్ చేయడంతో అది నేరుగా గ్రీన్ చేతికి చిక్కింది. దీంతో ఇషాన్ కిషన్ పెవిలియన్ బాట పట్టాడు.
వన్డే ప్రపంచకప్లో భాగంగా ఇవాళ భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్లో ఆస్ట్రేలియా తక్కువ స్కోర్కే ఆలౌట్ అయ్యింది. నిర్ణీత 50 ఓవర్ల కోటా కూడా పూర్తి చేయకుండానే తోక ముడిచింది. 49.3 ఓవర్లలో 199 పరుగులకు చాప చుట్టేసింది. భారత్ ముందు 200 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. ఆసీస్ బ్యాటర్లలో డేవిడ్ వార్నర్ (41), స్టీవెన్ స్మిత్ (46) మాత్రమే పరవాలేదనిపించారు. టీమిండియా బౌలర్లు రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ ఆసీస్ను కోలుకోలేని దెబ్బ కొట్టారు.
ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్.. మ్యాచ్ ప్రారంభం నుంచే పరుగులు రాబట్టడానికి తంటాలు పడింది. వార్నర్, స్టీవెన్ స్మిత్ కొంతసేపు నిలకడగా ఆడటంతో స్కోర్ బోర్డు మెల్లగా ముందుకు సాగింది. ఆ ఇద్దరూ ఔటైన తర్వాత జట్టు పరిస్థితి దయనీయంగా మారింది. చివర్లో మిచెల్ స్టార్క్ (28) రాణించడంతో ఆసీస్ ఆ మాత్రం గౌరవప్రదమైన స్కోర్నైనా చేయగలిగింది.
మూడో ఓవర్లో జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో ఆసీస్ ఓపెనర్ మిచెల్ మార్ష్ విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత వార్నర్, స్టీవెన్ స్మిత్ నిలకడగా ఆడారు. కానీ 17వ ఓవర్లో వార్నర్ ఔట్తో వికెట్ల పతనం మొదలైంది. 28వ ఓవర్లో స్టీవెన్ స్మిత్ ఔట్తో పరిస్థితి మరింత దిగజారింది. లబుషేన్ (27), గ్లెన్ మాక్స్వెల్ (15), పాట్ కమ్మిన్స్ (15) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు.
మిగతా బ్యాటర్లలో అలెక్స్ క్యారీ, కామెరూన్ గ్రీన్ ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ రెండేసి వికెట్ల చొప్పున తీశారు. రవిచంద్రన్ అశ్విన్, హార్దిక్ పాండ్యా, మహ్మద్ సిరాజ్ తలా ఓ వికెట్ పడగొట్టారు. భారత బౌలింగ్ ధాటికి అద్భుతమైన ఫీల్డింగ్ కూడా తోడు కావడంతో ఆసీస్ తక్కువ స్కోర్కు ఆలౌట్ అయ్యింది.
కనీసం 200 పరుగుల మార్క్ కూడా చేరకుండానే ఆస్ట్రేలియా ఆలౌట్ అయ్యింది. 50వ ఓవర్ మూడో బంతికి మహ్మద్ సిరాజ్ బౌలింగ్లో భారీ షాట్ కొట్టబోయిన మిచెల్ స్టార్క్ శ్రేయాస్ అయ్యర్కు క్యాచ్ ఇచ్చి 10వ వికెట్గా వెనుదిరిగాడు.
ఆస్ట్రేలియా జట్టు మరో వికెట్ కోల్పోయింది. 49వ ఓవర్లో జట్టు స్కోర్ 189 వద్ద ఉన్నప్పుడు హార్దిక్ పాండ్యా బౌలింగ్లో జంపా 9వ వికెట్ రూపంలో వెనుదిరిగాడు.
భారత స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా మరో అరుదైన ఘనత సాధించాడు. ఇవాళ్టి ప్రపంచకప్ మ్యాచ్లో మూడు వికెట్లు తీయడం ద్వారా వన్డేల్లో ఆస్ట్రేలియా జట్టుపై అత్యధిక వికెట్లు తీసిన మూడో భారత బౌలర్గా జడేజా రికార్డు నెలకొల్పాడు. ఇవాళ్టి మూడు వికెట్లతో కలిపి ఆసీస్పై జడేజా తీసిన వన్డే వికెట్ల సంఖ్య 37కు చేరింది.
కపిల్ దేవ్ 45 ఆసీస్ వికెట్లు తీసి జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత 38 వికెట్లతో మహ్మద్ సమీ రెండో స్థానంలో నిలిచాడు. మరో రెండు వికెట్లు తీస్తే మహ్మద్ సమీని వెనక్కి నెట్టి జడేజా రెండో స్థానానికి చేరుకోనున్నాడు. ఇక జడేజా తర్వాత అజిత్ అగార్కర్ (36 వికెట్లు), జగగల్ శ్రీనాథ్ (33 వికెట్లు), హర్భజన్ సింగ్ (32 వికెట్లు) వరుసగా నాలుగు, ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నారు.
ఆస్ట్రేలియా 45 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 172 పరుగులు చేసింది. ప్రస్తుతం మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా క్రీజులో ఉన్నారు. భారత బౌలింగ్ ధాటికి ఆసీస్ 200 పరుగులు కూడా చేసే అవకాశం కనిపించడం లేదు.
ఆస్ట్రేలియా జట్టు మరో వికెట్ కోల్పోయింది. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ (15) ఔటయ్యాడు. అప్పటికి జట్టు స్కోర్ 8 వికెట్ల నష్టానికి 165 పరుగులు.
ఆస్ట్రేలియా జట్టు 40 ఓవర్ల ఆట ముగిసే సమయానికి 7 వికెట్లు నష్టపోయి కేవలం 156 పరుగులు మాత్రమే చేయగలిగింది. జడేజా, కుల్దీప్ యాదవ్ వెంటవెంటనే వికెట్లు తీసి ఆసీస్ బ్యాటింగ్ లైనప్ను కోలుకోలేని దెబ్బ కొట్టారు.
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్లో తొలి సిక్సర్ నమోదైంది. 40వ ఓవర్లో కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమ్మిన్స్ సిక్స్ కొట్టాడు. భారత బౌలింగ్ ధాటికి నలభై ఓవర్ల వరకు ఆసీస్ బ్యాటర్లు ఎవరూ సిక్స్ కొట్టే సాహసం చేయలేదు.
ఆస్ట్రేలియా బ్యాటర్లు వరుసగా వికెట్లు సమర్పించుకుంటున్నారు. 37 ఓవర్లు కూడా ముగియకుండానే ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకున్నారు. 37వ ఓవర్ రెండో బంతికి అశ్విన్ బౌలింగ్లో కామెరూన్ గ్రీన్.. హార్దిక్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అప్పటికి జట్టు స్కోర్ 7 వికెట్ల నష్టానికి 140 పరుగులు.
ఆస్ట్రేలియా వికెట్ల పతనం కొనసాగుతోంది. భారత్ బౌలింగ్ ధాటికి నిలువలేక ఆసీస్ బ్యాటర్లు ఒక్కొక్కరుగా పెవిలియన్ బాట పడుతున్నారు. 36వ ఓవర్ ఐదో బంతికి కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో మాక్స్వెల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
ఆస్ట్రేలియా జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఇవాళ చెన్నైలో భారత్తో జరుగుతున్న మ్యాచ్లో ఆసీస్ బ్యాటర్లు పరుగులు చేయడానికి అష్టకష్టాలు పడుతున్నారు. కట్టుదిట్టమైన బౌలింగ్తో పరుగులు రాకపోగా వరుసగా వికెట్లు సమర్పించుకుంటున్నారు. దాంతో 35 ఓవర్ల ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 5 వికెట్ల నష్టానికి కేవలం 138 పరుగులు చేసింది.
ఆస్ట్రేలియా 30 ఓవర్ల ఆట ముగిసే సమయానికి ఐదు వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. జడేజా మూడు వికెట్లు తీసి ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్ నడ్డి విరిచాడు. ప్రస్తుతం గ్లెన్ మాక్స్వెల్, కామెరూన్ గ్రీన్ క్రీజులో ఉన్నారు.
ఆస్ట్రేలియా బ్యాటర్లు పరుగులు రాబట్టడానికి నానా తంటాలు పడుతున్నారు. భారత బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్తో ఆసీస్ స్కోర్ బోర్డు మందకొడిగా సాగుతోంది. 30 ఓవర్ల ఆట ముగిసే సమయానికి ఆ జట్టు ఐదు వికెట్లు కోల్పోయి కేవలం పరుగులు మాత్రమే చేయగలిగింది. 30వ ఓవర్లో లబుషేన్తోపాటు అలెక్స్ క్యారీని కూడా జడేజా అవుట్ చేశాడు. క్యారీ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.
ఆస్ట్రేలియా వికెట్ల పతనం కొనసాగుతోంది. 30వ ఓవర్ రెండో బంతికి లబుషేన్ (27 పరుగులు, 41 బంతుల్లో) ఔటయ్యాడు. జడేజా బౌలింగ్లో కేఎల్ రాహుల్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాటపట్టాడు. అప్పటికి జట్టు స్కోర్ 118/4.
ఆస్ట్రేలియా టీమ్ మరో వికెట్ కోల్పోయింది. 28వ ఓవర్లో జడేజా బౌలింగ్లో ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవెన్ స్మిత్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అప్పటికి స్మిత్ 71 బంతులను ఎదుర్కొని 46 పరుగులు చేశాడు. జట్టు స్కోర్ రెండు వికెట్ల నష్టానికి 110 పరుగులు.