బ్లూమ్ఫౌంటైన్: ప్రతిష్ఠాత్మక అండర్-19 ప్రపంచకప్లో యువ భారత్ మరోపోరుకు సిద్ధమైంది. ఇప్పటికే బంగ్లాదేశ్పై భారీ విజయం సాధించి జోరు మీదున్న భారత్..గురువారం ఐర్లాండ్తో తలపడనుంది. ఈ మ్యాచ్లో గెలిచి అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకునేందుకు పావులు కదుపుతున్నది.
బంగ్లాతో మ్యాచ్లో కెప్టెన్ ఉదయ్ సహరాన్, ఆదర్ష్సింగ్ అదరగొట్టగా, సహచర బ్యాటర్లు స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయారు. బౌలింగ్లో సౌమీకుమార్, ముషీర్ఖాన్ రాణిస్తున్నారు.