ఇంట్రా స్కాడ్ ప్రాక్టీస్ మ్యాచ్
కొలంబో: పరిమిత ఓవర్ల సిరీస్లు ఆడేందుకు శ్రీలంక వెళ్లిన శిఖర్ ధావన్ సారథ్యంలోని భారత జట్టు.. జోరుగా ప్రాక్టీస్ చేస్తున్నది. సోమవారం భారత జట్టు ఇంట్రా స్కాడ్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. ఇందులో ధావన్ ఒక జట్టుకు భువనేశ్వర్ మరో జట్టుకు నాయకత్వం వహించగా.. మనీశ్ పాండే, సూర్యకుమార్ అర్ధశతకాలతో మెరిశారు.