ప్రస్తుతం 52/1 l బుమ్రా పాంచ్ పటాకా
నాటింగ్హామ్: ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పట్టు బిగిస్తున్నది. ఆధిక్యం చేతులు మారుతూ వస్తున్న మ్యాచ్లో టీమ్ఇండియా మెరుగైన స్థితిలో నిలిచింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 209 పరుగుల లక్ష్యఛేదన కోసం రెండో ఇన్నింగ్స్కు దిగిన భారత్.. శనివారం ఆట ముగిసే సరికి వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది. ఇన్ఫామ్ బ్యాట్స్మన్ రాహుల్ (26) తొలి వికెట్గా వెనుదిరిగాడు. క్రీజులో ఉన్నంతసేపు ధాటిగా ఆడిన రాహుల్.. బ్రాడ్ బౌలింగ్లో బట్లర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. రోహిత్ (12), పుజారా (12) క్రీజులో ఉన్నారు. చేతిలో తొమ్మిది వికెట్లు ఉన్న టీమ్ఇండియా విజయానికి ఇంకా 157 పరుగుల దూరంలో ఉంది. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 25/0తో నాలుగో రోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్.. బుమ్రా (5/64) ధాటికి 303 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ జో రూట్ (109) సెంచరీతో కదంతొక్కాడు. సిరాజ్ (2/84), శార్దుల్ (2/37) రెండేసి వికెట్లు పడగొట్టారు.