న్యూఢిల్లీ: ఆసియా జూనియర్-కేడెట్ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్షిప్లో భారత మిక్స్డ్ డబుల్స్ జట్టు స్వర్ణం గెలిచింది. మంగళవారం హోరాహోరీ సాగిన ఫైనల్లో పయాస్ జైన్-యశస్విని జోడీ 11-9, 11-1, 10-12, 7-11, 11-8తో హాన్ జిన్యాన్-క్విన్ యుక్జాన్ (చైనా) జంటపై విజయం సాధించింది. ఆసియా చాంపియన్షిప్లో భారత జూనియర్లు స్వర్ణం సాధించడం ఇదే ప్రథమం.
ఈ యేడాది ఆరంభంలో కామన్వెల్త్ క్రీడల్లో భారత జోడి శరత్ కమల్-ఆకుల శ్రీజ స్వర్ణ సాధన స్ఫూర్తితో పయాస్, యశస్విని జూనియర్ విభాగంలోనూ పసిడి సాధించడం గమనార్హం. ఈ చాంపియన్షిప్లో భారత్కు మరో మూడు కాంస్యాలుకూడా దక్కాయి.