గెబెరా (దక్షిణాఫ్రికా): మహిళల టీ20 ప్రపంచకప్లో వరుస విజయాలతో జోరుమీదున్న భారత జట్టుకు తొలి పరాజయం ఎదురైంది. గత రెండు మ్యాచ్ల్లో నెగ్గిన హర్మన్ప్రీత్ కౌర్ బృందం శనివారం ఇంగ్లండ్తో జరిగిన పోరులో 11 పరుగుల తేడాతో ఓడింది. మొదట ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. నటాలియా షివర్ (50), అమీ జోన్స్ (40) రాణించారు. భారత బౌలర్లలో రేణుకా సింగ్ 5 వికెట్లతో సత్తాచాటింది.
అనంతరం లక్ష్యఛేదనలో టీమ్ఇండియా 20 ఓవర్లలో 5 వికెట్లకు 140 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతి మందన (41 బంతుల్లో 52; 7 ఫోర్లు, ఒక సిక్సర్), రిచా ఘోష్ (34 బంతుల్లో 47 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) పోరాడినా ఫలితం లేకపోయింది. షఫాలీ వర్మ (8), జెమీమా రోడ్రిగ్స్ (13), కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (4) విఫలమయ్యారు. చివరి ఓవర్లో విజయానికి 31 పరుగులు అవసరమైన దశలో రిచా రెచ్చిపోయినా 19 రన్స్ మాత్రమే రాబట్టగలిగింది.